రవితేజ, నక్కిన కాంబో రిపీట్ కానుందా..?

మాస్ మహారాజా రవితేజ ఆమధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆ టైమ్ లో ఆయనికి కిక్ ఇచ్చే సక్సెస్ ఇచ్చిన సినిమా ధమాకా. ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన థమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో మరోసారి రవితేజ, నక్కిన కలిసి పని చేయాలి అనుకున్నారు. అది ఇప్పుడు సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. అయితే.. ఈసారి నిర్మాత మారాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. రవితేజ ఇప్పుడు మలినేని గోపీచంద్ తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని సినిమాతో సమాంతరంగా చేస్తారా..? లేక ముందు వెనుకగానా అన్నది తేలాల్సి వుంది. ఆ విషయమై నిర్మాత దిల్ రాజు చర్చలు సాగిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు బెజవాడ ప్రసన్న కథ అందిస్తే నక్కిన త్రినాథరావు డైరెక్షన్ చేసేవారు. ఇప్పుడు రైటర్ ప్రసన్న లేకుండా తనే కథ, మాటలు రాసుకుని డైరెక్షన్ చేయనున్నారని తెలిసింది. మరి.. ఈసారి రవితేజను ఎలా చూపించనున్నారో..? ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.