ఓటీటీలోకి వరుణ్ సందేశ్ “విరాజి”

వరుణ్ సందేశ్(Varun sandesh) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ విరాజి(Viraaji) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 22న ఆహాలో ఈ సినిమా ప్రీమియర్ కానుంది. విరాజి సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదినీ, వైవా రాఘవ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మహేంద్రనాథ్ నిర్మించగా..కొత్త దర్శకుడు ఆద్యంత్ హర్ష రూపొందించారు. విరాజి సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు.

ఓ పాడుబడిన పిచ్చాసుపత్రిలోకి అనుకోకుండా వెళ్లిన కొందరు వ్యక్తులకు అనూహ్య ఘటనలు ఎదురువుతుంటాయి. ఆ బిల్డింగ్ లోకి విరాజిగా వెళ్తాడు వరుణ్ సందేశ్. ఈ బిల్డింగ్ లోకి వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా మృతి చెందుతుంటారు. వారిని చంపేదెవరు, అందుకు కారణాలు ఏంటి అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది. వరుణ్ సందేశ్ విరాజిలో కొత్త మేకోవర్ లో కనిపించాడు.