ఈ ముంబై బ్యూటికి టాలీవుడ్ లో మరో ఆఫర్

పలు యాడ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై బ్యూటీ మాళవిక శర్మ నేల టికెట్టు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా తొలి సినిమాకే ఏమీ దాచకుండా గ్లామర్ ప్రదర్శనలు చేసింది మాళవిక. సినిమాలు ఆడకున్నా..కెరీర్ నిర్మించుకున్న నాయికలు ఎందరో ఉన్నారు. అయితే వాళ్లు మాళవిక గ్లామర్ షో చేయకుండా కొంచెం జాగ్రత్త పడ్డారు. నేల టికెట్టు సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ హీరోగా నటించిన రెడ్ మూవీలోనూ హీరోయిన్ గా చేసింది మాళవిక. ఈ సినిమా కూడా అపజయం పాలైంది. రెడ్ తర్వాత ఈ భామ ఇక టాలీవుడ్ లో కనిపించలేదు.

ఇప్పుడు మళ్లీ మాళవికకు గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా సినిమాలో అ‌వకాశం దక్కింది. ఆమెకు వెల్ కమ్ చెబుతూ టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఏ హర్ష రూపొందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం భీమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఇక ఈ సినిమానే మాళవిక కెరీర్ ను డిసైడ్ చేయాలి.