ఆదిపురుష్ తాజా వివాదం ఇదే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్‌ చిత్రం పై రోజురోజుకు విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే సరికొత్త వివాదాలు పుట్టికొస్తున్నాయి. రామభక్తులు చాలా మందికి ఈ సరికొత్త రామాయణం అసలు నచ్చలేదు. ఇప్పటి వరకు అందరూ విన్నది.. చూసింది ఒక రామాయణం అయితే.. ఓంరౌత్ చూపించింది మరో రామాయణం. ఎవరూ ఊహించని రామాయణం చూపించేసరికి సినిమా చూసిన జనాలు షాక్ అయ్యారు.

ఇక అసలు విషయానికి వస్తే… ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది మా రామాయణం కాదని, రామున్ని, హనుమంతుణ్ణి అవమానిస్తూ ఈ సినిమా చేసారని ఈ చిత్రాన్ని థియేటర్స్ లో సహా ఓటిటిలో కూడా బ్యాన్ చేయాలి అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా తీసుకెళ్తామని చెప్పారు. దీనితో ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతుంది. మరి.. ఈ సరికొత్త వివాదం పై ఆదిపురుష్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.