వారసుల్ని చంపేసే ఐల్యాండ్ మిస్టరీ ఏంటి ?

ఏదో కొత్తదనం ఉంటే తప్ప హాట్ స్టార్ స్పెషల్స్(Hotstar specials) చేయదు. ఈసారి కూడా అలాంటి స్పెషాలిటీ ఉన్న వెబ్ సిరీస్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్(Disney plus hotstar). పర్పెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్”(Mystery of moksha island) ను ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” వెబ్ సిరీస్ కు అనిష్ యోహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు.

మోక్ష దీవి ఎంత అందమైనదో అంతే అంతు చిక్కనిది. ఇక్కడెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు దురాశతో కూడిన మనుషులవా లేకా ప్రకృతివా అనేదే ఆసక్తి కలిగించే అంశం. డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టించిన ఈ ఐల్యాండ్ లోని దారులన్నీ అతని దగ్గరకే చేరుతాయి. ఇలాంటి దీవిలోకి అతిథులుగా వస్తారు ఆ దీవి వారసులు. ఐల్యాండ్ లో హాయిగా రిలాక్స్ అవుదామని వచ్చిన ఆ వారసులు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుంటారు. ఆస్తిలో వాటాలు పెంచుకునేందుకు వారిలో వారే చంపుకుంటున్నారా, లేక ఈ హత్యల వెనక మరెవరైనా ఉన్నారా అనేది ట్రైలర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అసలేం జరిగిందో ఈ నెల 20 సిరీస్ మొత్తం చూస్తే గానీ తెలియదు.