బాలీవుడ్ సినిమా చేస్తున్న తెలుగు ప్రొడ్యూసర్స్

భారీ చిత్రాలతో పోటీ పడే రెండు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ కలిసి ఓ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చాయి. సన్నీ డియోల్ (Sunny deol) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand malineni) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రెజీనా కాసాండ్ర (Regena cassandra), సయామీ ఖేర్ (Sayami kher) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించారు.

తెలుగు దర్శకుడు, తెలుగు ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ లో బాలీవుడ్ హీరోతో సినిమా చేయడం ఇదే తొలిసారి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సన్నీ డియోల్ గతేడాది గదర్ 2 (Gadar 2) సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్ లు క్రియేట్ చేశారు. రెండు దశాబ్దాల తర్వాత తెరకెక్కిన ఈ సీక్వెల్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో సన్నీ డియోల్ మళ్లీ ఫేమ్ అయ్యారు. ఆయనకు బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.