సూర్య ‘కంగువ’ను నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

స్టార్ హీరో సూర్య (Suriya) భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా’కంగువ’ (kanguva) నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకుంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri movie distributors). ఇప్పటికే ఆదిపురుష్ (Adipurush), సలార్ (Salaar) వంటి బిగ్ మూవీస్ ను నైజాంలో రిలీజ్ చేసింది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు కంగువతో మరో భారీ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది కంగువ.

‘కంగువ’ చిత్రాన్ని దర్శకుడు శివ (Director siva) రూపొందిస్తున్నారు. దిశా పటానీ (Disha patani), బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (KE jnanavel raja), వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ‘కంగువ’ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.