వరద బాధితుల కోసం రూ.10 లక్షల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్

తెలంగాణ(Telangana)లో వరద బాధిత(Flood effect) ప్రజలను ఆదుకునేందుకు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM revanth reddy)కి అందజేశారు. జుబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సాయి దుర్గతేజ్(Sai durgha tej)..10 లక్షల రూపాయల చెక్ అందించారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడటం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు సాయి దుర్గతేజ్.

తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించి, ఆ మొత్తాన్ని మంత్రి లోకేష్ కు ఇటీవల అందజేశారు సాయి దుర్గతేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథాశ్రమాన్ని స్వయంగా సందర్శిచి, వారి బాగోగులు తెలుసుకున్నారు. అమ్మ ఆశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు. సాయి దుర్గతేజ్ సేవా గుణాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.