ప్రభాస్, మహేష్ తో పోటీకి సై అంటున్న రవితేజ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రతో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఒక గైడ్ లా వర్క్ చేస్తుండడం విశేషం. అయితే.. ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న గుంటూరు కారం చిత్రాన్నికూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న గుంటూరు కారం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్‌ గుంటూరు కారం అనుకుంటే.. రవితేజ ఈగల్ సినిమాతో పోటీకి సై అంటూ వస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. నాగ్, బెజవాడ ప్రసన్నకుమార్ సినిమా కూడా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి పోటీ మామూలుగా లేదుగా..