పదివేల టిక్కెట్లు బుక్ చేయనున్న రణ్ బీర్ కపూర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఇతివృత్తంగా ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. జూన్ 16న ఆదిపురుష్ మూవీని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. యు.ఎస్. లో కూడా భారీగా ప్రమోషన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నిరుపేద పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించడానికి 10,000 టిక్కెట్లను బుక్ చేయనున్నారు. నిరుపేద పిల్లల కోసం రణబీర్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్ వంశీ మరియు ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.