ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన రామ్

ఎనర్జిటిక్ హీరో, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు కానీ.. అంతకు మించి అప్ డేట్ లేదు. అయితే.. బోయపాటి సినిమా అంటే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా తెరకెక్కిస్తారని భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి రామ్ ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ రామ్ ఇచ్చిన అప్ డేట్ ఏంటంటే… యాక్షన్ సీన్ కోసం దాదాపు 24 రోజులు కష్టపడ్డాం. ఫైనల్ గా అది పూర్తయ్యిందని ఆయన చెప్పారు. కాగా ఇది క్లైమాక్స్ కాదని అంతకు మించి ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.

ఈ ట్వీట్ ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ కి కూడా ఎనర్జీ తెప్పించింది. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.