ఆహాలోకి వస్తున్న రాజ్ తరుణ్ “పురుషోత్తముడు”

రాజ్ తరుణ్(Raj tarun) హీరోగా నటించిన రీసెంట్ మూవీ పురుషోత్తముడు(Purushothamudu) ఆహా(Aha ott)లోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ భీమన రూపొందించారు. హాసినీ సుధీర్ హీరోయిన్ గా నటించింది. దాదాపు 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో కొత్త నిర్మాతలు రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. గత నెల 26న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

జూనియర్ శ్రీమంతుడు అనే పేరు తెచ్చుకున్న పురుషోత్తముడు సినిమా థియేటర్స్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ సినిమా కథ రాజ్ తరుణ్ ఇమేజ్ కు చాలా పెద్దదైపోయిందనే విమర్శలు వచ్చాయి. కడియం పూల తోటల రైతుల సమస్యల నేపథ్యంతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా పురుషోత్తముడు సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీ రోల్స్ చేశారు.