ప్రీక్వెల్ సన్నాహాల్లో “మంగళవారం”

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. చిన్న సినిమాగా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అజయ్ భూపతి పై అందరి దృష్టి పడింది. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే.. సిద్దు, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కించిన మహా సముద్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆతర్వాత అజయ్ భూపతి తన మూడవ సినిమాగా మంగళవారం(Mangalavaram) అనే సినిమా తీశాడు. తన మొదటి సినిమా కథానాయిక పాయల్ రాజ్ ఫుట్(Payl rajput) తోనే మంగళవారం అనే డిఫరెంట్ మూవీని తీశాడు. అయితే.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. నిర్మాతకు మాత్రం లాభాలను తీసుకువచ్చింది.

ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి(Ajay bhupathi) ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. మరి.. అజయ్ నెక్ట్స్ ఏంటి అంటే.. మంగళవారం మూవీకి సీక్వెల్ తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే.. మంగళవారం సీక్వెల్ కాదట. ప్రీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఆతర్వాత ఇందులో నటించే నటీనుటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఫైనల్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలిసింది. అజయ్ భూపతి ఈసారి పక్కాగా హిట్ మూవీ తీయాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడట. మరి.. ఈసారైనా అజయ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.