వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ భారీ విరాళం

సొసైటీలో ఏ విపత్తు జరిగినా తన వంతుగా సాయం చేసేందుకు ముందుంటారు ప్రభాస్(Prabhas). అది రాష్ట్రమైనా దేశమైనా ప్రభాస్ విరాళం భారీగానే ఉంటుంది. వరదలతో(Floods) ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల(Andhra pradesh, Telangana)కు అండగా నిలబడ్డారు ప్రభాస్. ఏపీ, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.

ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ అమౌంట్ ప్రభాస్ డొనేట్ చేశారు. తెలుగు ప్రజలు వరద విపత్తు నుంచి త్వరగా కోలుకుని మళ్లీ సంతోషంగా ఉండాలని ప్రభాస్ ఈ సందర్భంగా కోరారు. ఇటీవల ప్రభాస్ కేరళ వయనాడ్ విపత్తు బాధితులకు 2 కోట్ల రూపాయల విరాళం అందించి అక్కడి ప్రజల మనసు గెల్చుకున్నారు.