టెన్షన్ లో పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని విధంగా వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తెర వెనుక అంతా చూసుకునేది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బ్రో చిత్రానికి ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సివుంది. జులై 28న బ్రో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక ఓజీ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. జూన్ 14 నుంచి వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో పవన్ తో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఓ వైపు బ్రో పూర్తవ్వాలి.. మరో వైపు ఓజీ కంప్లీట్ చేయాలి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ కోసం ప్లానింగ్ లో ఉన్నారు. వీరమల్లు కూడా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇలా పవన్ వారాహి యాత్ర స్టార్ట్ చేయాలి అనుకోవడంతో సినిమాల పరిస్థితి ఏంటనే టెన్షన్ మొదలైంది. అయితే.. జూన్ 13 వరకు ఓజీ సినిమాకి డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారని సమాచారం.