పవన్ కల్యాణ్ పంపిన మెసేజ్ తో హ్యాపీగా ఫీలయ్యా – కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం సినిమాలోని మేఘం కరుగత పాటకు అవార్డ్ గెల్చుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jhany master). ఆయనకు ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

జానీ మాస్టర్ మాట్లాడుతూ – ప్రభుదేవా గారు చేసిన వెన్నెలవే వెన్నెలవే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇలాంటి పాట ఒకటి నేనూ చేయాలనే కలగనేవాడిని. ఆ అవకాశం ధనుష్ గారి తిరుచిత్రాంబలంతో నాకు దక్కింది. అక్కడ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసేందుకు నన్నే పిలిపించారు ధనుష్ గారు. ధనుష్ గారికి, తిరుచిత్రాంబలం మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం అంటే అందుకు ముక్కురాజు మాస్టర్, నా ముందున్న డ్యానర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషే కారణం. నాకు నేషనల్ అవార్డ్ రాగానే డిఫ్యూటీ సీఎం పవన్ గారు అభినందిస్తూ మెసేజ్ పంపారు. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అన్నారు.