బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. వాదనలు విన్న నాంపల్లి కోర్టు ప్రశాంత్ కు బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని బెయిల్ కండీషన్స్ లో కోర్టు పేర్కొంది. బిగ్ బాస్ లో గెల్చిన తర్వాత జరిగిన గొడవల కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇవాళ కోర్టు బెయిల్ ఇచ్చింది.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 గెల్చిన తర్వాత అన్నపూర్ణ వెనక గేట్ నుంచి వెళ్లాల్సిందిగా పోలీసులు చెప్పారు. అలాగే వెళ్లిన ప్రశాంత్ మళ్లీ పోలీసులు గొడవలు జరుగుతాయని హెచ్చరించిన రోడ్డులోకి విజయయాత్రగా వచ్చారు. అక్కడ గొడవలు మొదలయ్యాయి. ప్రశాంత్ వెంట ఉన్న వారు రన్నరప్ అమర్ దీప్ మీద రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. ఈ కేసులో ప్రశాంత్, అతని సోదరుడు సహా 16 మందిని అరెస్ట్ చేశారు.