షూటింగ్ కు రెడీ అవుతున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్(NTR) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashant neel) రూపొందించబోయే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ మూవీ ఇదని చెప్పుకోవచ్చు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ బిగ్ మూవీ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందనే టాక్ మొదలైంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, కాస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. హీరోయిన్ గా కియారా అద్వానీ(Kiara advani)ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలాఖరున లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు లాంఛింగ్ రోజునే ప్రకటించారు.