వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ఇచ్చిన ఎన్టీఆర్

భారీ వర్షాలు(Heavy rains), వరదల(Floods)తో రెండు తెలుగు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు నుంచి ఆదుకునేందుకు తెలుగు స్టార్స్ తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ముందుగా స్పందించారు ఎన్టీఆర్(NTR). తన వంతుగా సాయం అందించేందుకు ఎన్టీఆర్ ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేస్, తెలంగాణ ప్రభత్వాలకు 50 లక్షల చొప్పున కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఎన్టీఆర్.

వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులు మనసు కలచివేస్తున్నాయని, ఈ పరిస్థితి నుంచి తెలుగు ప్రజలు త్వరగా బయటపడాలని ఎన్టీఆర్ కోరుకున్నారు. వరద బాధితుల కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు తీసుకుంటున్న సహాయ చర్యలకు మద్ధతుగా తాను 50 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.