నిహారిక కొణిదెల (Niharika konidela) నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee kurrollu) సినిమాకు తన అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi). ఇటీవల రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా మెగాస్టార్ ఈ సినిమా చూసి తన ఇంటికి ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ను పిలిచి మెచ్చుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ – మా నిహారిక నిర్మించిన ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మరచిపోయాను. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచురల్గా చిత్రీకరించటం ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే, అది తెరపై కనిపించింది. అన్నారు.