ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు కౌంటర్

తిరుపతి లడ్డూ(Thirupathi laddu) ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి వాడారనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని చెబుతూ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్(Prakash raj) మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పరిష్కారం చూపించండి. దీన్ని జాతీయ స్థాయిలో ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూ అంటూ ప్రశ్నించాడు.

ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు మా అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu vishnu). ప్రకాష్ రాజ్ సంయమనం పాటించాలని, తన హద్దులు మీరి జోక్యం చేసుకోవద్దని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్, ఏపీ ప్రభుత్వం తిరుపతి లడ్డు నాణ్యత విషయంలో విచారణ చేస్తోందని, తిరుపతి లడ్డు అనేది హిందువులకు సెంటిమెంట్ తో ముడిపడిన విషయమని మంచు విష్ణు ట్వీట్ లో పేర్కొన్నారు.