ఇండియా తిరిగొచ్చిన మహేశ్

గత రెండు వారాలుగా వెకేషన్ లో ఉన్న మహేశ్ బాబు ఇండియా తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన ఫ్యామిలీతో వస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్ టూర్ వెళ్లారు మహేశ్ బాబు.

ప్రస్తుతం మహేశ్ నటిస్తున్నసినిమా గుంటూరు కారం కొత్త షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా షెడ్యూల్ లో మహేశ్ పాల్గొంటారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. గుంటూరు కారం సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ చెబుతున్నారు.