పూర్తిగా “ఎస్ఎస్ఎంబీ 29” లుక్ లోకి మారిపోయిన మహేష్

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar maheshbabu) అమెరికా పర్యటన(USA tour) ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. కుటుంబ సభ్యులతో తిరిగి వచ్చిన ఆయనను ఎయిర్ పోర్ట్ లో మీడియా ఫొటోస్ తీసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు పూర్తిగా ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29) లుక్ లోకి మారిపోయారు. గుంటూరు కారం రిలీజ్ అయినప్పటి నుంచి మహేశ్ దర్శకుడు రాజమౌళి(SS rajamouli) రూపొందించబోయే ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.

రీసెంట్ గా మహేశ్ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా టూర్ కు వెళ్లారు. మహేశ్ తన కొడుకు గౌతమ్ ను న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేశారు. అలాగే అక్కడే కొద్ది రోజులు వెకేషన్ లో గడిపారు. ఈ రోజు హైదరాబాద్ కు తిరిగివచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మహేశ్, రాజమౌళి కాంబో మూవీ ప్రారంభం కాబోతోంది. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబీ 29 భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.