షూటింగ్ లో బిజీ అయిన మెగా కోడలు

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల ఎంగేజ్ మెంట్ ఈ నెల 9న ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. మ్యారేజ్ ఈ ఇయర్ ఎండ్ లో అని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా కన్ ఫర్మ్ కాలేదు. ఎంగేజ్ మెంట్ తర్వాత ఈ ప్రేమపక్షులు విదేశాలకు వెళ్లారు. అయితే.. ఈ అమ్మడు పెళ్లి తర్వాత నటిస్తుందా..? లేదా..? అనేది తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం షూటింగ్ లో బిజీ అయ్యింది. ప్రస్తుతం లావణ్య రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. స్కై లాబ్ అనే సినిమా తీసిన యువ దర్శకుడు విశ్వక్ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు.

అందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు మూడు ప్రాజెక్ట్ లున్నాయి. రెండు వెబ్ డ్రామాస్, ఒకటి తమిళ మూవీ. ఈ సినిమాలు చేస్తూనే పెళ్ళికి రెడీ అవుతుందట. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ మానేసే ఆలోచనలో లేదు లావణ్య అనేది ఓ వార్త ప్రచారంలో ఉంది. అలాగే నటనకు గుడ్ బై చెప్పి నిర్మాణ రంగం వైపు అడుగులు వేయాలి అనుకుంటుంది అనేది కూడా వినిపిస్తుంది. మరి.. లావణ్య మనసులో ఏముందో త్వరలో బయటపెడుతుందేమో.