కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పలు షాకింగ్ విషయాలను పోలీసులు పొందుపర్చారు. నిన్నంతా జానీ మాస్టర్ ను ఓ రహస్య ప్రదేశంలో సీసీఎస్ పోలీసులు విచారించారు. ఆ విచారణలో జానీ మాస్టర్ తను తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చిన కీలక అంశాలు చూస్తే – జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు. చెడు ఆలోచనలతోనే బాధితురాలని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారు. ఐదేళ్ల కిందటే మాస్టర్కు బాధితురాలు పరిచయమైంది. 2020లో ముంబైలో ఈవెంట్ సందర్భంగా జానీ మాస్టర్ బాధితురాలిపై మొదటి సారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. (అందుకే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు). అలాగే గత నాలుగేళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి జరిపాడు. ఈ విషయం బయటికి వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని అతను బెదిరించాడు. జానీ మాస్టర్ భార్య ఆయేషా ఉరఫ్ సుమలత కూడా బాధితురాలిని బెదిరించింది. అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు.
ప్రస్తుతం జానీ మాస్టర్ ను 14 రోజుల రిమాండ్ అనంతరం చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.