గుంటూరు కారం ఇంట్రస్టింగ్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. తాజా షెడ్యూల్ ఈ నెల 12 నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఈ సినిమా కో డైరెక్టర్ తప్పుకోవడంతో వాయిదా పడిందని టాక్ వచ్చింది. మరో వార్త ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించి ఇంటి సీన్స్ తీయాల్సివుందట. అయితే.. ఇప్పటికిప్పుడు ఇంటి సెట్ వేయాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి పెద్ద ఇల్లు కోసం చూస్తున్నారట. అలాగే మహేష్‌, ప్రకాష్ రాజ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాలి. ఆయన డేట్స్ 20 నుంచి అతి కష్టం మీద దొరికాయట. తాజా సమాచారం ప్రకారం 20 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.