మహేష్, రాజమౌళి ప్లాన్ మారిందా..?

రాజమౌళి(Director SS rajamouli) సినిమా అంటే.. ఒక యజ్ఞంలా చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. అమరశిల్పి జక్కన్నలా చెక్కుతుంటారు. అందుకనే.. రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar mahesh babu)తో చేయనున్న పాన్ వరల్డ్ మూవీ విషయంలో రాజమౌళి ప్లాన్ మారింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. అసలు ప్లాన్ ఏంటి..? రాజమౌళి మార్చిన ప్లాన్ ఏంటి..?

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో మూవీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ అప్ డేట్ మాత్రం రావడం లేదు. కృష్ణ జయంతి సందర్భంగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని ప్రకటిస్తారని టాక్ వినిపించింది కానీ.. జరగలేదు. ఆతర్వాత మహేష్ బాబు బర్త్ డేకి అనౌన్స్ మెంట్ అంటూ ప్రచారం జరిగింది. సూపర్ స్టార్ పుట్టినరోజు కూడా వచ్చింది కానీ.. ఈ సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ అసలు ప్లాన్ ఏంటంటే.. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఇప్పుడు రాజమౌళి ప్లాన్ మారిందట. ఇంతకీ విషయం ఏంటంటే.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఆల్రెడీ మహేష్ బాబుతో పాటు మరి కొంత మంది కీలక పాత్రలు పోషించే నటీనటులతో వర్క్ షాపు స్టార్ట్ చేశారని తెలిసింది. ఈ మూవీ కోసం హైదరాబాద్లో భారీ సెట్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను రాజమౌళి అనౌన్స్ చేయనున్నారని సమాచారం. భారీ, క్రేజీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్(Sri durga arts) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరి.. ఈ మూవీతో మహేష్, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.