లడ్డూ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కార్తీ

తిరుపతి లడ్డూను తక్కువ చేసేలా తాను వ్యాఖ్యలు చేయలేదని, సరదాగా అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు హీరో కార్తీ(Hero Kaarthi). నిన్న హైదరాబాద్ లో జరిగిన సత్యం సుందరం సినిమా ఫంక్షన్ లో కార్తీ యాంకర్ వేదిక మీద మీమ్స్ ప్లే చేస్తూ లడ్డు కావాలా నాయనా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా లడ్డూ అనేది ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. కార్తీ సరదాగా చెప్పిన ఈ మాటలు వైరల్ అయ్యాయి.

కార్తీ మాటలకు పవన్(Pawan Kalyan) స్పందిస్తూ మన సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి అని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై కార్తీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. డియర్ పవన్ కల్యాణ్ సర్. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నా. నేను వేంకటేశ్వర స్వామి భక్తుడిని. మన సంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. అని పోస్ట్ చేశారు.