మహేశ్, రాజమౌళి మూవీ – ప్రచారంలోకి కొత్త టైటిల్

సూపర్ స్టార్ మహేష్‌(Mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది కానీ.. ప్రకటన మాత్రం రావడం లేదు. కృష్ణ జయంతి రోజున ప్రకటిస్తారని టాక్ వినిపించింది కానీ.. జరగలేదు. ఆతర్వాత మహేష్ పుట్టినరోజున అనౌన్స్ మెంట్ ఖాయం అనుకున్నారు కానీ.. రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ భారీ, క్రేజీ మూవీ గురించి అధికారికంగా ప్రకటిస్తారా అని సూపర్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. ఆ రోజున ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ వేస్తున్నారు. టీమ్ అంతా అక్కడే ఉండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి వర్క్ షాపులో టీమ్ అంతా జాయిన్ అవుతారట. ఇక డిసెంబర్ నుంచి ఈ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారనేది ఇన్ సైడ్ న్యూస్.

ఈ మూవీకి ముందుగా మహరాజ్ టైటిల్ అనుకున్నారు కానీ.. అది పక్కన పెట్టేశారు. ఆతర్వాత గరుడ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు గోల్డ్(GOLD) అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్(Sri durga as) పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి.. మహేష్, రాజమౌళి ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.