సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన “డబుల్ ఇస్మార్ట్”

రామ్(Ram) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్(Puri jagannath) రూపొందించిన డబుల్ ఇస్మార్ట్(Double ismart) సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ అ‌వుతోంది. గత నెల 15న పాన్ ఇండియా రిలీజ్ కు వచ్చింది డబుల్ ఇస్మార్ట్.

ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా పర్ ఫార్మ్ చేయలేదు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను డబుల్ ఇస్మార్ట్ కొనసాగించలేకపోయింది. ఈ సినిమాతో దర్శకుడు పూరి మరోసారి విమర్శల పాలయ్యాడు. డబుల్ ఇస్మార్ట్ ఆల్ థియేట్రికల్ రైట్స్ కొన్న నిర్మాత కె నిరంజన్ రెడ్డికి దాదాపు 40 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.