ఆనంద్ దేవరకొండ డైబ్యూ మూవీకి ఐదేళ్లు

సింపుల్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీస్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ (Anand devarakonda). ఆయన ఫస్ట్ మూవీ దొరసాని (Dorasani). 80వ దశకం నేపథ్యంలో దొరల కాలంలో జరిగిన ఓ యదార్థ ప్రేమ కథగా దొరసాని సినిమాను రూపొందించారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిందీ సినిమా.

ఆనంద్ దేవరకొండ సహజమైన నటనకు అందరి అప్రిషియేషన్స్ దక్కాయి. 2019 జూలై 12న దొరసాని సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజుకు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దొరసాని సినిమా ఫిఫ్త్ ఇయర్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆనంద్ సరసన హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక (Shivatmika) హీరోయిన్ గా నటించింది. దొరసాని సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్ (Madhura entertainments), బిగ్ బెన్ సినిమాస్ (Big ben cinemas) సంయుక్తంగా నిర్మించాయి.