స్పీడు పెంచిన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకప్పుడు వరుసగా భారీ చిత్రాలు నిర్మించాడు. ఇప్పుడు కూడా భారీ చిత్రాలు నిర్మిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో మూవీ కూడా నిర్మిస్తున్నారు. కాకపోతే కాస్త స్లో అయ్యారు. అయితే.. ఇక నుంచి స్పీడు పెంచాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు సైలెంట్ టా స్పీడు పెంచుతున్నారు. రవితేజ,నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో ఓ సినిమాను సెట్ చేసుకున్నారు. ఇదిలా వుండగా మరో రెండు సినిమాలను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అలాగే జటాయువు అనే భారీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. ఈ భారీ ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తోంది. నితిన్, వేణు శ్రీరామ్ సినిమా కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఇవి కాకుండా మరో ఒకటి రెండు మిడ్ రేంజ్ సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని సమాచారం. మొత్తానికి దిల్ రాజు స్పీడు పెంచారన్న మాట.