ఏఎన్నార్ కు ట్రిబ్యూట్ గా “ధూం ధాం” మూవీ నుంచి వీడియో రిలీజ్

ఈ రోజు తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్ గా “ధూం ధాం” సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు “ధూం ధాం” టీమ్. ఈ చిత్రంలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

అక్కినేని నాగేశ్వరరావుకు ట్రిబ్యూట్ గా “ధూం ధాం” సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ లోని మనసు గతి ఇంతే పాటను వెన్నెల కిషోర్ పాడుతున్న వీడియో ఆకట్టుకుంటోంది. “ధూం ధాం” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గోపీసుందర్ స్వరపర్చిన పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ పాజిటివ్ వైబ్స్ తో “ధూం ధాం” సినిమాను హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.