‘దరీ దాటిన మోహం.. దేహమే కదా’

సక్సెస్ ఫుల్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ చేసుకుంటోంది “కాలమేగా కరిగింది” సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘తను జతగా..’, ‘ఊహలోన ఊసులాడే..’ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలకు వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి దరీ దాటిన మోహం అంటూ సాగే మరో బ్యూటిఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ పాటకు డైరెక్టర్ శింగర మోహన్ ఆకట్టుకునే లిరిక్స్ రాయగా.. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ మరో హిట్ ట్యూన్ అందించారు. సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి అందంగా పాడారు. దరీ దాటిన మోహం పాట ఎలా ఉందో చూస్తే – దరీ దాటిన మోహం దేహమే కదా, ఎదుటే నిలిచేను, ఆ యదపై తాకేను, చెలీ వీడినా మౌనం, మర్మమే కదా, కథలై కదిలేను..అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

“కాలమేగా కరిగింది” సినిమాలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన “కాలమేగా కరిగింది” సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.