డిజిటల్ ప్రీమియర్ కు వస్తున్న “కమిటీ కుర్రోళ్లు”

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది కమిటీ కుర్రోళ్లు(Committee kurrollu). నిహారిక కొణిదెల(Niharika konidela) నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. థియేటర్స్ మంచి వసూళ్లు సాధించిన కమిటీ కుర్రోళ్లు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈటీవీ విన్(Etv WIN) లో ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

కమిటీ కుర్రోళ్లు సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా తదితరులు కీ రోల్స్ చేశారు. కొత్త దర్శకుడు యదు వంశీ రూపొందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మంచి ఎంటర్ టైనింగ్ డ్రామాగా కమిటీ కుర్రోళ్లు ఆకట్టుకుంది. థియేట్రికల్ గా సక్సెస్ అయ్యింది కాబట్టి డిజిటల్ గా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశాలున్నాయి.