చిరు మూవీ నుంచి కొత్త న్యూస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 11న భోళా శంకర్ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట్ లతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మల్లిడి వశిష్ట్ తో చేసే సినిమా సోషియో ఫాంటసీ మూవీ కాగా కళ్యాణ్ కృష్ణతో చేసే సినిమా బ్రో డాడీ రీమేక్ అని ప్రచారం జరిగింది. ఇందులో చిరంజీవి, సిద్దు తండ్రీకొడుకులుగా నటించనున్నారని తెలిసినప్పటి నుంచి ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమే అనుకున్నారు.

కొత్త న్యూస్ ఏంటంటే… బ్రో డీడీ రీమేక్ కాదట. ఈ చిత్రం కొత్త తెలుగు కథతోనే రాబోతుందట. దీని కోసం ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ స్టోరీని రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా డీల్ చేయగల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.