బ్రో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ఇటీవల వార్తలు వచ్చాయి. జులై 28న బ్రో మూవీని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన రావడంతో బ్రో మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ ఈ రోజుతో పూర్తవుతుందట. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ను త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు. ఇందులో పవన్, తేజ్ లతో కలిసి స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ రౌటేలా నటిస్తుంది. ఈ సాంగ్ సినిమాకి హైలెట్ కానుందని సమాచారం. విరూపాక్ష తర్వాత తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. మేనమామ, మేనల్లుడు కలిసి నటించిన ఫస్ట్ మూవీ కావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అని టాక్ బలంగా వినిపిస్తుంది. మరి.. బ్రో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.