జగన్ పై బ్రహ్మాజీ ట్వీట్ వైరల్

ఏపీలో వరదల(Ap Floods)తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు విఫలమయ్యారంటూ జగన్(jagan) చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రీట్వీట్ చేశారు నటుడు బ్రహ్మాజీ(Brahmaji). బ్రహ్మాజీ చేసిన ఈ కౌంటర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రహ్మాజీ తన ట్వీట్ లో.. ‘వాళ్ల వల్ల కాదు మనం చేద్దాం. ఒక 1000 కోట్లు విడుదల చేద్దాం. మనకు అధికారం కాదు ప్రజలు ముఖ్యం, వైకాపా క్యాడర్ ను రంగంలోకి దించుదాం’ అంటూ పేర్కొన్నారు. తన ట్వీట్ వైరల్ కావడంతో బ్రహ్మాజీ స్పందించారు. ఆ ట్వీట్ తను చేసింది కాదని, తన అక్కౌంట్ హ్యాక్ అయ్యిందని మళ్లీ ట్వీట్ చేశారు. అక్కౌంట్ హ్యాకింగ్ పై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు బ్రహ్మాజీ తెలిపారు.