బెల్లకొండ మిస్టరీ థ్రిల్లర్ మొదలైంది

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda srinivas) కొత్త సినిమా ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బెల్లంకొండ నటిస్తున్న 11వ చిత్రమిది. బీస్ఎస్ 11 (BSS 11) అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథతో చావు కబురు చల్లగా చిత్ర దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి (Koushik pegallapati) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ గతంలో రాక్షసుడు అనే సక్సెస్ ఫుల్ సినిమాలో జోడీగా నటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ (Shine screens) లో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో స్ట్రాంగ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.