అనసూయకు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా..?

విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సినిమా గురించి కానీ.. ఆయన మాట్లాడిన మాటల గురించి కానీ.. అనసూయ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం.. ఆమె కామెంట్స్ కి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం జరుగుతుంటుంది. ఇటీవల ఖుషి సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ పేరు ముందు ది అనే పెట్టారు. అంటే ది విజయ్ దేవరకొండ అని పెట్టారు. అలా పెట్టుకోవడం అతని ఇష్టం. అయితే.. దీని పై కూడా అనసూయ విమర్శలు చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో ఆమె పై విజయ్ ఫ్యాన్స ఫైర్ అయ్యారు.

అసలు ఏమైంది..? ఇద్దరి మధ్య గొడవ ఏంటి అంటే.. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ లో విజయ్ డైలాగ్ గురించి అనసూయ కామెంట్ చేసిందట. అప్పటి నుంచి అనసూయ పై విజయ్ కు సంబంధించిన వ్యక్తులు కొంత మందికి డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్ చేయించారట. ఇది విజయ్ కు తెలుసో లేదో కానీ.. ఈ విషయం తెలిసి బాధపడ్డాను అని అనసూయ బయటపెట్టింది. అంతే కాకుండా.. ఇక నుంచి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. అందుచేత విజయ్ గురించి ఇక నుంచి కామెంట్ చేయను అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ అమ్మడుకు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదైతేనే మొత్తానికి ఇన్నాళ్లకు కోల్డ్ వార్ క్లోజ్ అయినట్టు అయ్యింది.