అన్యాయంపై తిరగబడే టెడ్డీ బేర్ “బడ్డీ”

అల్లు శిరీష్ (Allu shirish) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ” (Buddy). గాయత్రి భరద్వాజ్ (Gayatri bharadwaj), ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha rajesh singh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ (Studio green filims) బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (KE gnanavel raja), అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ (Sam Anton) దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచర్ యాక్షన్ మూవీగా బడ్డీ సినిమా తెరకెక్కింది. జూలై 26న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో టెడ్డీ బేర్ చేసిన హంగామా సినిమా మీద ఆసక్తిని కలిగిస్తోంది.

చరిత్రలో అన్యాయంపై తిరగబడే సింహం, పులి, చిరుతను చూసి ఉంటారు గానీ ఒక టెడ్డీ బేర్ ను చూశారా అంటూ సాయి కుమార్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో బడ్డీ ట్రైలర్ బిగిన్ అయ్యింది. ఏటీసీ ఉద్యోగిగా హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కనిపించింది. కెప్టెన్ ఆదిత్యరామ్ గా శిరీష్ నటించారు. ఏటీసీతో నిత్యం టచ్ లో ఉండే కెప్టెన్ గా గాయత్రికి దగ్గరవుతాడు శిరీష్. ఆ తర్వాత టెడ్డీ ఎంటర్ అవుతుంది. ఈ టెడ్డీ ఎవరు, ఆ టెడ్డీ ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. ఆ టెడ్డీ బేర్ కు హీరో ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు. దాన్ని కాపాడేందుకు ఎందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది బడ్డీ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. బడ్డీ సినిమా ట్రైలర్ లో సీజీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ ఎలిమెంట్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. టెడ్డీతో కలిసి శిరీష్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి.