క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్

అల్లు అర్జున్(Allu arjun)తో దర్శకుడు క్రిష్(Krish) రూపొందించిన వేదం(vedam) సినిమా ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో కేబుల్ రాజు క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటించాడు. వేదం తర్వాత మళ్లీ క్రిష్ అల్లు అర్జున్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడా సందర్భం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది సినిమా కాదు. యాడ్ ఫిల్మ్ కోసం.

కూల్ డ్రింక్ థమ్సప్(ThumsUp) బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు ప్లేస్ లోకి అల్లు అర్జున్ వచ్చారు. ఈ థమ్సప్ కోసం కొత్త యాడ్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఈ యాడ్ ను రూపొందిస్తున్నారు క్రిష్. ఈ యాడ్ తర్వాత ఏదైనా కథ కుదిరితే ఈ కాంబోలో మూవీ కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనుష్కతో ఘాటి(Ghaati) అనే మూవీ చేస్తున్నారు క్రిష్. అల్లు అర్జున్ పుష్ప2(Pushpa 2) లో బిజీగా ఉన్నారు.