రెండో రోజు అదరగొట్టిన ఆదిపురుష్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రం పై విమర్శలు వస్తుండడం తెలిసిందే. ఓంరౌత్ నేటి జనరేషన్ కి రామాయణం గురించి చెప్పాలని తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణం అయ్యింది. ఇప్పటి వరకు చూసిన రామాయణాలకు పూర్తి భిన్నంగా ఈ రామాయణం ఉండడంతో ఇదేంటి ఇలా ఉంది ఆదిపురుష్‌ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 140 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. విమర్శల నేపధ్యంలో రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే… బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు 100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీంతో రెండు రోజులకు ఆదిపురుష్ 240 కోట్లు కలెక్ట్ చేసింది. మూడవ రోజు ఆదివారం కూడా అన్ని ఏరియాల్లో మంచి వసూలు రాబట్టినట్టు రిపోర్ట్ వస్తుంది. డివైడ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే.. ఇక మంచి టాక్ వచ్చుంటే.. కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండేవో. ఏది ఏమైనా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం.