పుకార్లకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరో వైపు వారాహి యాత్ర అంటూ పొలిటికల్ గా ఫుల్ బిజీ అయ్యారు. అయితే.. పవన్ కళ్యాణ్‌ మరోసారి విడాకులు తీసుకున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఇది నిజమా..? లేక ఏదో విమర్శించాలని అలా విమర్శిస్తున్నారా..? అనేది ఆసక్తిగా మారింది. కొంత మంది అయితే… ఇది నిజమేనేమో అనుకున్నారు. అయితే.. ఒకే ఒక్క ఫోటోతో ప్రచారంలో ఉన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడేలా చేశారు పవర్ స్టార్. ఇంతకీ విషయం ఏంటంటే… వారాహి విజయ యాత్ర తొలిదశ దిగ్విజయం గా పూర్తి కావడం తో, హైదరాబాద్ లోని తమ నివాసం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అనా కొణిదెల పూజలో పాల్గొన్నారు.

అయితే.. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో చిత్రంలో నటించారు. ఈ చిత్రం జులై 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచనున్నారు. త్వరలో బ్రో నుంచి అప్ డేట్స్ రానున్నాయని ఇటీవల థమన్ ప్రకటించారు. ఈ చిత్రంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు చేస్తున్నారు.