“గుంటూరు కారం”..ఇంకా ఎంత రాబట్టాలంటే..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ తో కలెక్షన్స్ తగ్గినా…పూర్తిగా డౌన్ కాలేదు. త్వరలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుతుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు దాదాపు 130 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా..ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 80 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

బయ్యర్ల పెట్టుబడి తిరిగి రావాలంటే ఇంకా దాదాపు 50 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ఇవాళ్టితో సంక్రాంతి హాలీడేస్ కంప్లీట్ కావడంతో ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ లేదు. యూత్ ఆడియెన్స్ మీదే హోప్స్ ఉన్నాయి. మిక్స్డ్ టాక్ లోనూ ఈమాత్రం కలెక్షన్స్ రావడం మహేశ్ స్టార్ డమ్ తోనే సాధ్యమైందని అనుకోవచ్చు.