హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య గొడవ జరిగిందా..?

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్పై. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని ప్రకటించినప్పుడు ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ అనుకున్నారు కానీ.. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి స్పై మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇది పాన్ ఇండియా మూవీ.. ప్రమోషన్స్ చేయడానికి టైమ్ కావాలి. అందుచేత ఈ మూవీ రిలీజ్ వాయిదా వేద్దామని నిఖిల్.. నిర్మాత రాజశేఖర్ రెడ్డికి చెప్పాడట. అయితే నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం అనౌన్స్ చేసినట్టుగా ఈ నెల 29నే విడుదల చేద్దామని పట్టుదలగా ఉన్నాడట. కారణం ఏంటంటే.. ఓటీటీ రిలీజ్ కి కూడా డేట్ ముందే ఫిక్స్ చేశారట. ఓటీటీకి చెప్పిన డేట్ కు రిలీజ్ చేయకపోతే నిర్మాతకు భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే 29నే నిర్మాత విడుదల చేద్దామంటే.. నిఖిల్ నో అంటున్నాడట. ఈ విషయమై హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య డిఫరెన్సస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీంతో స్పై మూవీ 29న వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది.