అనాధలకు ఆదిపురుష్ చూపించనున్న మంచు మనోజ్

ఇప్పుడు సినీ అభిమానుల ఎవరి నోట విన్నా ఆదిపురుష్ గురించే. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ మూవీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆదిపురుష్ మూవీ పై క్రేజ్ ఉండడం విశేషం. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆదిపురుష్ విడుదల కానుంది. అయితే.. ఆదివారం నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

అయితే.. రణ్ బీర్ కపూర్ ఆదిపురుష్ మూవీ పదివేల టిక్కెట్లు కొని అనాథలకు, చిన్న పిల్లలకు చూపించనున్నట్టు ప్రకటించాడు. అలాగే అభిషేక్ నామా కూడా పది వేల టిక్కెట్లను కొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆదిపురుష్ మూవీని చూపించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా 2,500 మంది అనాధ పిల్లలకు ఆదిపురుష్ మూవీని చూపించబోతుండడం విశేషం. మనోజ్ మరియు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాధ శరణాలయాల్లోని 2500 మంది అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసి వారికి ఉచితంగా ఆదిపురుష్ మూవీని చూసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.