తన 50వ సినిమా కంప్లీట్ చేసిన ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాను కంప్లీట్ చేశారు. ఇది ధనుష్ కెరీర్ లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ధనుష్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. 2017లో పా పాండి అనే సినిమా తర్వాత మళ్లీ ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎస్ జే సూర్య, సందీప్ కిషన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అప్డేట్ ను ధనుష్ ఇవాళ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. డీ 50గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ఆయన తెలిపారు. తన విజన్ ను నమ్మి సపోర్ట్ చేసిన సన్ పిక్చర్స్, ఇతర టీమ్ మెంబర్స్ కు ధనుష్ థ్యాంక్స్ చెప్పాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా డీ 50 రూపొందుతోంది.