చిరు మూవీలో 8 మంది హీరోయిన్లు. ఇది నిజమేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇది సోసియో ఫాంటసీ మూవీ అని టాక్ వినిపిస్తుంది. ఈ కథ చిరుకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారని.. ఈ ఎనిమిది మంది హీరోయిన్లు కూడా కీలక పాత్రలు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో నటించే ఆ ఎనిమిది మంది కథానాయికలు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అప్పటి హీరోయిన్ల నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకు ఎవరు డేట్స్ అందుబాటులో ఉంటాయో వాళ్లతో ఈ పాత్రలను చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్. మరి.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ట్ చిరు మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడా అనేది ఆసక్తిగా మారింది.