పవన్.. ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈమధ్య కాలంలో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తయిన సినిమా అంటే బ్రో ఒక్కటే. దీనికి కారణం సముద్రఖని. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ కి అనుకున్న విధంగా కంప్లీట్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. అందుకనే పవన్ సముద్రఖనికి మరో సినిమా చేసే ఆఫర్ ఇచ్చారని సమాచారం.

బ్రో సినిమా వినోదయ సీతమ్ కు రీమేక్. ఈసారి రీమేక్ కాకుండా.. స్ట్రైయిట్ మూవీ చేయాలి అనుకుంటున్నారట. పవన్ ఇప్పుడు తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. సముద్రఖని కూడా తక్కువ టైమ్ లో సినిమా కంప్లీట్ చేయగలడని పవన్ కళ్యాణ్ కు పూర్తి నమ్మకం వచ్చింది. దీనికి తోడు సముద్రఖని సినిమాలు అన్నీ కొత్తగా ఉంటాయి. జులై 28న బ్రో మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత పవన్, సముద్రఖని కొత్త సినిమా గురించి ప్రకటిస్తారేమో చూడాలి.